కరోనా ఉగ్రరూపం..ఏపీలో కొత్తగా 210 పాజిటివ్ కేసులు

|

Jun 06, 2020 | 1:39 PM

కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ని వణికిస్తోంది. శనివారం(జూన్6న) ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు న‌మోదు అయ్యాయి.

కరోనా ఉగ్రరూపం..ఏపీలో కొత్తగా 210 పాజిటివ్ కేసులు
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ని వణికిస్తోంది. శనివారం(జూన్6న) ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 161మంది, వ‌ల‌స కూలీలు 41మంది, ఎన్‌ఆర్ఐలు 8 మంది ఉన్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4460 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 3588కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 131 కేసులు, వ‌ల‌స కూలీల 741 కేసులున్నాయి.. ఎపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 73మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు 2వేల 323 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 274 మంది, ఎన్‌ఆర్ఐలు న‌లుగు‌రు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..ప్ర‌స్తుతం జిల్లాలో 1192యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 127మంది, వ‌ల‌స కూలీలు 467 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందు‌తున్నారు..తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.