మూడు రాజధానుల ప్రణాళికకు మార్గం సుగమం చేసుకుంటున్న జగన్ సర్కార్..

| Edited By:

Jan 14, 2020 | 11:48 AM

మూడు రాజధానులు అంశంతో ఏపీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు రాజధానిని తరలించొద్దంటూ.. అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేపడుతుంటే.. మరోవైపు దీనిని అధికార వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అందుకు మూడు రాజధానులు ఫార్ములా కరెక్ట్ అంటున్న జగన్ సర్కార్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్దమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి.. పాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించే విధంగా […]

మూడు రాజధానుల ప్రణాళికకు మార్గం సుగమం చేసుకుంటున్న జగన్ సర్కార్..
Follow us on

మూడు రాజధానులు అంశంతో ఏపీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు రాజధానిని తరలించొద్దంటూ.. అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేపడుతుంటే.. మరోవైపు దీనిని అధికార వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అందుకు మూడు రాజధానులు ఫార్ములా కరెక్ట్ అంటున్న జగన్ సర్కార్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది.

అందుకోసం ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్దమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి.. పాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించే విధంగా రూపుదిద్దుతున్నారు. అయితే దీంట్లో ఎక్కడా కూడా.. రాజధాని అమరావతిని తరలిస్తున్నట్లు పేర్కొనకుండా ఉండేవిధంగా.. అదేసమయంలో ఇందుకు తలెత్తుతున్న న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనే విధంగా జాగ్రత్తపడుతున్నారు. ఇప్పుడు తీసుకురాబోయే చట్ట ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. వివిధ సంస్థలకు చెందిన కార్యకలాపాలను విస్తరించేందుకు దోహదపడే విధంగా రెడీ చేస్తున్నారు. అందుకోసం ఈ జనవరి నెలలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లును నెగ్గించుకుని చట్టంగా రూపొందించేందుకు కసరత్తులు చేస్తోంది జగన్ సర్కార్. దీంతోనే ఈ రాజధాని అంశానికి చెక్ పెట్టే యోచనలో ఉంది.