కారు డోర్ లాక్.. ఏడేళ్ల బాలుడు మృతి..!
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో దారుణం జరిగింది. దొమ్మెరు గ్రామానికి చెందిన లక్ష్మికి.. సాయి అనే ఏడేళ్ల కొడుకు వున్నాడు. ఆటలాడుతూ ఇంటి ఎదుటవున్న కారులోకి ఎక్కాడు. వెంటనే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి. నాలుగు గంటలపాటు కారులోనేవున్న బాలుడు.. ఊపిరాడక చనిపోయాడు. స్థానికులు చూసేసరికి విగత జీవిగా కనిపించాడు సాయి. వెంటనే కొవ్వూరు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని అలా చూసి కన్నతల్లి.. కన్నీరు మున్నీరు అవుతోంది. లక్ష్మీ.. భర్త […]
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో దారుణం జరిగింది. దొమ్మెరు గ్రామానికి చెందిన లక్ష్మికి.. సాయి అనే ఏడేళ్ల కొడుకు వున్నాడు. ఆటలాడుతూ ఇంటి ఎదుటవున్న కారులోకి ఎక్కాడు. వెంటనే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి. నాలుగు గంటలపాటు కారులోనేవున్న బాలుడు.. ఊపిరాడక చనిపోయాడు. స్థానికులు చూసేసరికి విగత జీవిగా కనిపించాడు సాయి. వెంటనే కొవ్వూరు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని అలా చూసి కన్నతల్లి.. కన్నీరు మున్నీరు అవుతోంది. లక్ష్మీ.. భర్త ఇటీవలే చనిపోయాడు. తన కొడుకుని తీసుకుని తండ్రి వద్దే ఉంటోంది.