ఏపీలో రీపోలింగ్ జరిగే కేంద్రాలివే..!
ఏపీలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీని కోరామని తెలిపారు గోపాలకృష్ణ ద్వివేది. జిల్లా కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈసీకి వివరాలు పంపించామన్నారు. కాగా.. ఈసీ ఆదేశాల మేరకు రీపోలింగ్ కోసం సిఫార్సు చేసిన 5 కేంద్రాల పేర్లను ఆయన వెల్లడించారు. అవి: నరసరావు పేట నియోజక వర్గ పరిధిలోని కేశానపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నల్లచెరువులోని 244వ పోలింగ్ కేంద్రం, కోవూరులోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ కేంద్రం, […]
ఏపీలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీని కోరామని తెలిపారు గోపాలకృష్ణ ద్వివేది. జిల్లా కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈసీకి వివరాలు పంపించామన్నారు. కాగా.. ఈసీ ఆదేశాల మేరకు రీపోలింగ్ కోసం సిఫార్సు చేసిన 5 కేంద్రాల పేర్లను ఆయన వెల్లడించారు.
అవి: నరసరావు పేట నియోజక వర్గ పరిధిలోని కేశానపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నల్లచెరువులోని 244వ పోలింగ్ కేంద్రం, కోవూరులోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో కలనూతలలోని 247వ పోలింగ్ కేంద్రాలుగా పేర్కొన్నారు. కాగా.. ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్లో అల్లర్లు, గొడవలు, దాడులు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఇరు పార్టీలకు సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు కూడా మరణించారు.