‘ఇండియాతో వాణిజ్య ఒప్పందమా ? ఇప్పట్లో లేనట్టే’…

| Edited By: Anil kumar poka

Feb 19, 2020 | 11:36 AM

ఇండియాతో అతి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పట్లో కుదుర్చుకునే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని, ఆ లోగా భారత్ తో డీల్ కుదరకపోవచ్ఛునని ఆయన చెప్పారు. ఈ నెల 24-25 తేదీల్లో ట్రంప్ ఇండియాను సందర్శించనున్నారు. ఆయన రాక సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య కోట్లాది డాలర్ల విలువైన భారీ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు […]

ఇండియాతో వాణిజ్య ఒప్పందమా ? ఇప్పట్లో లేనట్టే...
Follow us on

ఇండియాతో అతి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పట్లో కుదుర్చుకునే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని, ఆ లోగా భారత్ తో డీల్ కుదరకపోవచ్ఛునని ఆయన చెప్పారు. ఈ నెల 24-25 తేదీల్లో ట్రంప్ ఇండియాను సందర్శించనున్నారు. ఆయన రాక సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య కోట్లాది డాలర్ల విలువైన భారీ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు జరిగే లోగా ఈ ప్రక్రియ జరుగుతుందా అన్న విషయం తాను చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరమే ఇందుకు అవకాశాలు ఉన్నాయని, కానీ డీల్ తప్పకుండా కుదుర్చుకుంటామని అన్నారు. మంగళవారం వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఉభయ దేశాల మధ్య గల వాణిజ్య సంబంధాల పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో ఇండియా తమను దాదాపు నిర్లక్ష్యం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ‘వుయ్ ఆర్ నాట్ ట్రీటెడ్ వెల్ బై ఇండియా’ అని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని మోదీని ప్రశంసిస్తూ.. ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానని తెలిపారు.

ఢిల్లీలో మోదీని, ఇతర మంత్రులను కలిసిన అనంతరం తామిద్దరం అహ్మదాబాద్ వెళ్తామని, అక్కడ భారీ స్టేడియంలో  ప్రసంగించనున్నామని చెప్పిన ఆయన.. విమానాశ్రయానికి, ఈ స్టేడియానికి మధ్య సుమారు 70 లక్షలమంది ప్రజలు తనను ఆహ్వానం పలుకుతారని మోడీ చెప్పారని వెల్లడించారు. ఆ స్టేడియం ఇంకా నిర్మాణ దశలో ఉందని, ప్రపంచంలో అది అతి పెద్ద స్టేడియం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదెంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీరంతా కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను అని ఆయన చెప్పారు.