గోమూత్రంతో క్యాన్సర్‌కు చెక్.. కేంద్రమంత్రి చౌబే

మొన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్.. నిన్న కేంద్రమంత్రి అశ్వనీకుమార్‌ చౌబే.. గోమూత్రంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చంటూ చెబుతున్నారు. తాను గోమూత్రంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉన్నానంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాధ్వితో పాటుగా కేంద్ర మంత్రి కూడా ఇదే విషయం చెబుతున్నారు. అంతేకాదు ఆయుర్వేద, యోగ అండ్ నేచురోపతి, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి(ఆయుష్) మంత్రిత్వశాఖ గోమూత్రంతో ఔషధాలు తయారు చేయనున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ […]

గోమూత్రంతో క్యాన్సర్‌కు చెక్.. కేంద్రమంత్రి చౌబే
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2019 | 1:46 PM

మొన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్.. నిన్న కేంద్రమంత్రి అశ్వనీకుమార్‌ చౌబే.. గోమూత్రంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చంటూ చెబుతున్నారు. తాను గోమూత్రంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉన్నానంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాధ్వితో పాటుగా కేంద్ర మంత్రి కూడా ఇదే విషయం చెబుతున్నారు. అంతేకాదు ఆయుర్వేద, యోగ అండ్ నేచురోపతి, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి(ఆయుష్) మంత్రిత్వశాఖ గోమూత్రంతో ఔషధాలు తయారు చేయనున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే తెలిపారు. గోమూత్రంతో వివిధ రకాల ఔషధాలు తయారు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా గోమూత్రంతో ఔషధాలు తయారుచేయవచ్చాన్నారు. అంతేకాదు మాజీ ప్రధాని దివంగత మొరార్జీ దేశాయ్ కూడా గోమూత్రం సేవించడం మంచిదని చెప్పారన్న విషయాన్ని కేంద్రమంత్రి గుర్తు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయుష్మాన్ భారత్ పథకంలో క్యాన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తున్నదని తెలిపారు.