గిల్గిట్- బాల్టిస్థాన్ దాడిలో ఐదుగురు పాక్ పోలీసులు మృతి
పాకిస్థాన్పై మరోసారి దాడికి పాల్పడింది గిల్గిట్-బాల్టిస్థాన్. సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఐదుగురు పోలీసులు మృతిచెందారు. ఈ ఘటన చిలాస్ జిల్లాలోని డియామర్ ప్రాంతంలో..
పాకిస్థాన్పై మరోసారి దాడికి పాల్పడింది గిల్గిట్-బాల్టిస్థాన్. సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఐదుగురు పోలీసులు మృతిచెందారు. ఈ ఘటన చిలాస్ జిల్లాలోని డియామర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్కు చెందిన పోలీసు అధికారులు సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేపడుతుండగా.. వారిపై కొందరు దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పాక్ పోలీసులు చనిపోగా.. మరో అధికారి గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆయుధాల అక్రమ రవాణా చేసే వ్యాపారులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.