నైవేలి లిగ్నైట్ లో పేలిన బాయిలర్.. 6గురు మృతి.. 25మందికి గాయాలు..
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ విద్యుత్ ప్లాంట్లో జరిగిన బాయిలర్ పేలుడులో 17 మంది కార్మికులు గాయపడ్డారు. నైవేలి లిగ్నైట్
Neyveli Lignite power plant boiler explosion: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ విద్యుత్ ప్లాంట్లో జరిగిన బాయిలర్ పేలుడులో ఆరుగురు మృతి చెందారు, పాతికమంది కార్మికులు గాయపడ్డారు. నైవేలి లిగ్నైట్ ప్లాంట్ స్టేజ్ 2 లోని బాయిలర్లో పేలుడు సంభవించింది. క్షతగాత్రులను ఎన్ఎల్సి లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. మే నెలలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్ప్లాజాలు..