మోదీ@100 రోజుల పరిపాలన… ఏలా సాగిందంటే..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా అధికారం బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఇవాళ్టికి మోదీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యింది. తొలిసారి అధికారం చేపట్టిన దానికంటే రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ చారిత్రక నిర్ణయాలుగా మిగిలిపోయేలా ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా వంద రోజుల్లోనే మోదీ తన మార్క్ పాలనను ప్రజలకు చూపించాడు. పటిష్టమైన […]

మోదీ@100 రోజుల పరిపాలన... ఏలా సాగిందంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 2:38 PM

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా అధికారం బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఇవాళ్టికి మోదీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యింది. తొలిసారి అధికారం చేపట్టిన దానికంటే రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ చారిత్రక నిర్ణయాలుగా మిగిలిపోయేలా ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా వంద రోజుల్లోనే మోదీ తన మార్క్ పాలనను ప్రజలకు చూపించాడు. పటిష్టమైన ప్రభుత్వం ఉండటంతో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోడానికైనా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. చారిత్రక సంస్కరణలు తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం సఫలమైంది. ట్రిపుల్ తలాక్, జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాద నిరోధక చట్టం వంటి చట్టాలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం రాజకీయ చతురతను ప్రదర్శించింది. ఇక ఓ వైపు దేశంలో ఇలాంటి సంస్కరణలను తీసుకువస్తూ.. మరోవైపు విదేశీ వ్యవహారాలకు కూడా అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి వంద రోజుల్లో 17 రోజులు విదేశీ పర్యటనల్లోనే గడిపారు. గతంలో ఏ ప్రధాని కూడా వెళ్లని దేశాల్లో మోదీ పర్యటించడం విశేషం.

విదేశీ టూర్‌లలో ఆర్థిక, రక్షణ, విద్యుత్తు వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటూనే.. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగడుతూ.. పాక్‌ చేస్తున్న చర్యలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్‌ ఎంతగా గగ్గోలు పెట్టినా అంతర్జాతీయ సమాజం భారత్‌వైపే నిలబడి, ఆ దేశం వాదనను ఎవరూ పట్టించుకోకపోవడం మోదీ విదేశాంగ విధానం గొప్పతనమే.

ఇక నేటికి వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచీ కొద్ది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమాల్లో కూడా రాజకీయ లాభం కోసం చూస్తూ.. ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ప్లాన్లు వేస్తుంది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని కీలక ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇలా అన్ని చోట్ల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే.. ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించేలా ప్లాన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం ఒకటి. దీని ద్వారా… వంట గ్యాస్ లేనివారికి కేంద్రం గ్యాస్ బండ, LPG కనెక్షన్ ఉచితంగా ఇస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 8 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే… 6 నెలల ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంది.

2014తో చూస్తే.. ప్రస్తుతం మోదీ తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటున్నాయి. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు మరింత గుర్తింపు వచ్చేలా చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలు. సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా… దూసుకెళ్తుంది. ప్రధానంగా… లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకోవడంతో.. పార్టీ వర్గాల్లో కూడా జోష్ మరింత పెరిగింది.

ప్రధానంగా మోదీ… ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా ఈ 100 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ అంశంతోపాటూ… ముస్లిం మహిళలకు సంబంధించి ట్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారు. అయితే ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందడానికి సరైన బలం లేకున్నా.. ప్రతిపక్ష పార్టీలతో తమదైన శైలిలో రాజకీయ చతురతను ఉపయోగించి.. బిల్లులకు ఆమోదం పొందేలా చేశారు. ఇక న్యాయపరమైన అంశాల్లో మరింత పారదర్శకత తెస్తూ… హైప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం అయ్యేలా, అవినీతిని కట్టడి చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే 2025 నాటికి రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆధునిక వైద్య వ్యవస్థను ఏకీకృతం చేస్తూ తీసుకున్న ఆయుష్ కార్యక్రమంతో పాటుగా.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్‌‌ను కఠినతరం చేస్తూ మోటార్ వాహన చట్టాన్ని సవరించారు.

అయితే… ఆర్థిక మాంద్యం కేంద్ర ప్రభుత్వానికి సవాళ్‌గా మారింది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవీ ఆర్థిక మాంద్యం సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఉపశమన నిర్ణయాలు కూడా కలిసిరావట్లేదనే వాదన కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. మోదీ తొలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయ దోరణి వీడి.. ఆర్థిక నిపుణుల సలహాలు స్వీకరించి సంక్షోభం నుంచి దేశాన్ని బయట వేయాలంటూ హితవు పలికారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. బ్యాంకుల విలీనం నిర్ణయంపై కూడా భిన్న వాదనలు వెలువడుతున్నాయి. మొత్తానికి దేశం ఉన్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి కేంద్రం ఎంతవరకూ దేశాన్ని గట్టెక్కిస్తుందో భవిష్యత్తులో తెలుస్తుంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో