ఏపీ నూతన గవర్నర్‌తో విజయసాయి రెడ్డి భేటీ

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్ నివాసానికెళ్లిన విజయసాయి రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వభూషణ్‌ను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు. కాగా ఈ నెల 24న విశ్వభూషణ్ ఏపీ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు తీసుకోనుండగా.. దీనికి సంబంధించిన […]

ఏపీ నూతన గవర్నర్‌తో విజయసాయి రెడ్డి భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2019 | 9:44 AM

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్ నివాసానికెళ్లిన విజయసాయి రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వభూషణ్‌ను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.

కాగా ఈ నెల 24న విశ్వభూషణ్ ఏపీ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు తీసుకోనుండగా.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.