Kabul Blast: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి.. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పేలుడు
Afghanistan Bomb Blast: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడులో చాలామందికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ లీగ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి..
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం ఆత్మాహుతి దాడితో మరోసారి ఉలిక్కిపడింది. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడులో చాలామందికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ లీగ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. గత కొద్దిరోజులుగా కాబూల్లో వరుసగా పేలుళ్లు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక ఐసిస్ హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు.
ఐపిఎల్ వంటి ఫార్మాట్లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది, ఆ తర్వాత గందరగోళ వాతావరణం నెలకొంది. నిజానికి కాబూల్లో టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దాడి అనంతరం ఆటగాళ్లందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్టేడియంపై దాడి జరిగినప్పుడు, ఇంటర్వ్యూ కోసం అక్కడికి చేరుకున్న ఐక్యరాజ్యసమితి వ్యక్తి అక్కడ ఉన్నాడు.
Footage : There have been casualties in the blast at the Kabul international cricket stadium. #Afghanistan pic.twitter.com/wM7qMsVDpR
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) July 29, 2022
కాబూల్లోని గురుద్వారా కార్తే పర్వాన్ గేట్ సమీపంలో పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే.. జూన్లో, కాబూల్లోని బాగ్-ఇ బాలా పరిసరాల్లోని గురుద్వారా కార్తే పర్వాన్లో అనేక పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. గురుద్వారాపై జరిగిన ఘోరమైన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ పేలుడులో ఒక సిక్కు వ్యక్తి సహా మరో ఇద్దరు మరణించారు.
మేలో, ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో, కాబూల్, ఉత్తర నగరమైన మజార్-ఇ-షరీఫ్లో జరిగిన నాలుగు పేలుళ్లలో 14 మంది మరణించారు మరియు 32 మంది గాయపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..