Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. ఇస్కంధర్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించిన పుతిన్..

Iskander Missiles:ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. కీవ్‌ను ఆక్రమించేవరకూ తగ్గేదేలే..అంటోంది రష్యా. సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. ఇస్కంధర్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించిన పుతిన్..
Iskander Missiles

Updated on: Mar 25, 2022 | 3:39 PM

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. కీవ్‌ను ఆక్రమించేవరకూ తగ్గేదేలే..అంటోంది రష్యా. సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే తామేం తక్కువ కాదంటోంది ఉక్రెయిన్‌. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కంధర్‌ మిస్సైల్స్‌ను తాజాగా ప్రయోగించింది రష్యా. నాటో వార్నింగ్‌ను లైట్‌గా తీసుకున్న పుతిన్‌ దాడులను రెట్టింపు చేయాలని రష్యా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలండ్‌ సిటీకి చేరుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌. ఈ పర్యటన మరింత అగ్గి రాజేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తమను కవ్విస్తే అణుయుద్ధం తప్పదని రష్యా ఇప్పటికే హెచ్చరించింది.

రష్యా బలగాలకు తోడుగా చెచెన్‌ ఫైటర్స్‌ కూడా పలు నగరాల్లో ఉక్రెయిన్‌ సైన్యంపై దాడులు చేస్తున్నారు. మరియాపోల్‌లో ఓ బిల్డింగ్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులపై చెచెన్‌ ఫైటర్స్‌ మెరుపుదాడి చేశారు.

ఇదిలావుంటే.. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ తన యూరోపియన్ పర్యటన చివరి స్టాప్ అయిన శుక్రవారం పోలాండ్ చేరుకోనున్నారు. రష్యా దండయాత్ర తర్వాత యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది ప్రజలు పొరుగున ఉన్న పోలాండ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇదే సమయంలో బిడెన్ పోలాండ్‌కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

ఈ సంక్షోభ సమయంలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)లోని ఉక్రెయిన్‌కు  సహాయం చేయడానికి US నిబద్ధతను బిడెన్ పునరుద్ఘాటించారు. బ్రస్సెల్స్‌లో, NATO, గ్రూప్ ఆఫ్ సెవెన్ ఇండస్ట్రియల్ నేషన్స్,  ఉక్రెయిన్‌పై 27 మంది సభ్యుల యూరోపియన్ కౌన్సిల్ అత్యవసర సమావేశానికి హాజరైన తర్వాత బిడెన్ శుక్రవారం రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్‌కు చేరుకున్నారు.

ఉక్రెయిన్‌లో పాశ్చాత్య శాంతి పరిరక్షక దళాలను మోహరించాలన్న పోలాండ్ ప్రతిపాదన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని బెలారసియన్ ప్రముఖ నాయకుడు హెచ్చరించాడు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో గత వారం పోలాండ్ శాంతి మిషన్ ప్రతిపాదనను ఎత్తి చూపారు.

ఇవి కూడా చదవండి: Pegasus Spyware: టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై హౌస్‌ కమిటీ.. చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..

Yogi Adithyanath: యూపీలో బుల్డోజర్ బాబా హవా.. విజయంతో ముస్లిం యువతలో క్రేజ్.. పూర్తి వివరాలివే