
అమెరికా అభివృద్ధిలో హిందూ-అమెరికన్ సమాజం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తూ, ఒక ముఖ్యమైన తీర్మానం అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ముందుకు వచ్చింది. , వారిపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలను తీవ్రంగా ఖండించేలా ఈ తీర్మానాన్ని తీసువచ్చారు. మిచిగాన్కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదార్ ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అమెరికా రాజకీయ వర్గాల నుండి, ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన ప్రతిప్రతినిధుల నుండి నిరంతర మద్దతు లభిస్తోంది.
తాజాగా, ప్రముఖ భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఈ తీర్మానానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. అమెరికా సమాజానికి హిందూ సమాజం చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. 2025 జనవరి 24న ఈ తీర్మానాన్ని మొదటగా సభలో ప్రవేశపెట్టగా, అప్పటి నుండి దీనికి మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 32 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు పలకడం విశేషం. ఈ తీర్మానానికి సహ-ప్రాయోజకులుగా భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రమణియన్ కూడా వ్యవహరిస్తున్నారు.
తీర్మానంలోని ముఖ్యాంశాలు:
అమెరికా ప్రగతిలో తాము భాగస్వాములమే కాక, దేశ భద్రత, శాంతిభద్రతలను గౌరవించే పౌరులుగా హిందూ సమాజానికి ఈ తీర్మానం ఒక పెద్ద ముందడుగు. ఇది వారి సేవలను అధికారికంగా గుర్తించడంతో పాటు, భవిష్యత్తులో వారి రక్షణకు, హక్కుల సాధనకు ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..