
సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కొంత సమయం సైకిల్ తొక్కితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా తక్కువ దూరం వరకు వెళ్లేందుకు సైకిళ్లను ఉపయోగిస్తుంటారు. స్కూల్ కు వెళ్లే చిన్నారులైతే రోజూ సైకిల్ పైనే వెళ్తుంటారు. చిన్నప్పటి నుంచి సైకిల్ నడపడం వల్ల వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు, కండర బలానికి ఉపయోగపడుతుంది. అయితే ఎవరైనా రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుతారు. అంతకంటే ఎక్కువ దూరం సైకిల్ పై వెళ్లాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక కొండ ప్రాంతాల్లో సైకిల్ నడపడం చాలా కష్టం. అయితే.. ఫ్రాన్స్కు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏకంగా సైకిల్ పై దేశాలనే దాటేశారు. ఏంటీ నమ్మడం లేదా.. ఇది నిజమండి బాబోయ్.. కావాలంటే ఈ స్టోరీ చదివేయండి. ఫ్రాన్స్ దేశానికి చెందిన మేరీ, ఇరిక్ అనే వీరిద్దరూ ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నారు.
అయితే అందరిలా ఫ్లైట్ లోనో, షిప్ లోనో కాకుండా వెరైటీగా ఉండాలని కోరుకున్నారు. అందుకు సైకిల్ ను మంచి సాధనంగా ఉపయోగించుకున్నారు. సైకిల్ పై భారత్ కు రావాలని డిసైడ్ అయ్యారు. అయితే వారి వయస్సు అప్పటికే 50, 60 ఏళ్లు. శరీరం సహకరిస్తుందా, లేదా అనే డౌట్ ను బ్రేక్ చేస్తూ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. ఇక లేట్ చేయకుండా 7 నెలల పాటు సైకిల్ పై ప్రయాణిస్తూ ముంబై మీదుగా కోల్కతాకు చేరుకున్నారు.
జీపీఎస్ ఆధారంగా ప్రయాణిస్తున్న వీరు వాకాడులో అక్టోబరు 21న ఇండియాకు చేరుకున్నారు. ఏడు నెలల పాటు సాగిన తమ ప్రయాణం సంతోషంగా సాగిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరు ఫేమస్ అయిపోయారు. వీరి సైకిల్ యాత్రపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ వయసులో అంతదూరం సైకిల్ యాత్ర చేయడం చాలా గొప్ప విషయం అని కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా వారికి తెలిసిన వారికి చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో ఫ్రాన్స్ నుంచి ఇండియాకు, అది కూడా సైకిల్ తొక్కుకుంటూ రావడం నిజంగా గ్రేట్ కదూ..
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి