ఆస్పత్రిలో చేరిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు

| Edited By:

Mar 18, 2019 | 2:49 PM

కరాచీ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముష‌ర్రఫ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గతకొంత కాలంగా ముషర్రఫ్ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కాగా ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అత్యవ‌స‌రంగా దుబాయ్ హాస్పిట‌ల్లో చేర్పించారు. ఇప్పటికే ఈ వ్యాధి నివారణ కోసం ముషర్రఫ్ ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. అయితే మ‌ళ్లీ ఆ వ్యాధి ముద‌ర‌డంతో .. ముష‌ర్రఫ్‌ను దుబాయ్‌కి త‌ర‌లించారు. ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ ఈ విష‌యాన్ని వెల్లడించింది. అమిలోడోసిస్ […]

ఆస్పత్రిలో చేరిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు
Follow us on

కరాచీ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముష‌ర్రఫ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గతకొంత కాలంగా ముషర్రఫ్ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కాగా ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అత్యవ‌స‌రంగా దుబాయ్ హాస్పిట‌ల్లో చేర్పించారు. ఇప్పటికే ఈ వ్యాధి నివారణ కోసం ముషర్రఫ్ ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. అయితే మ‌ళ్లీ ఆ వ్యాధి ముద‌ర‌డంతో .. ముష‌ర్రఫ్‌ను దుబాయ్‌కి త‌ర‌లించారు. ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ ఈ విష‌యాన్ని వెల్లడించింది. అమిలోడోసిస్ రియాక్షన్‌తో ముష్రర‌ఫ్ బాధ‌ప‌డుతున్నార‌ని డాక్టర్లు వెల్లడించారు.ఈ వ్యాధి ప్రభావంతో ముష‌ర్రఫ్ త‌న కాళ్ల మీద నిల‌బ‌డ‌లేక‌పోతున్నారు, న‌డ‌వ‌లేక‌పోతున్నారు. కాగా గ‌తంలో కూడా ఇదే వ్యాధితీ అస్వస్థతకు గురై.. లండ‌న్‌లో చికిత్స తీసుకున్నారు.