ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత

| Edited By: Phani CH

Aug 16, 2021 | 2:09 PM

అసలే ఆఫ్ఘన్ లోని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న అక్కడి భారతీయులకు మరో షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ ను మూసివేసిన కారణంగా అక్కడి విమానాశ్రయం నుంచి ఏ విమానాన్నీ నడపలేమని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.

ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్  స్పేస్ మూసివేత
Air India
Follow us on

అసలే ఆఫ్ఘన్ లోని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న అక్కడి భారతీయులకు మరో షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ ను మూసివేసిన కారణంగా అక్కడి విమానాశ్రయం నుంచి ఏ విమానాన్నీ నడపలేమని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. అంటే ఆ ఎయిర్ పోర్టులో ఏ విమానం కూడా దిగే పరిస్థితి లేదన్నారు. ఆఫ్ఘన్ లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు ఉద్దేశించిన ఎయిరిండియా విమానాన్ని ప్రస్తుతం అక్కడికి పంపజాలమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాబూల్ వెళ్ళవలసిన విమాన సమయాన్ని మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రీ-షెడ్యూల్ చేసినప్పటికీ అక్కడి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు ఓ ముఖ్య నోటీసు జారీ అయిందని అంటున్నారు.మరోవైపు కాబూల్ లో గుంపులను అదుపు చేసేందుకు అమెరికా దళాలు గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తొక్కిడి, దోపిడీల నివారణకు ఇలా కాల్పులు జరిపారని, కమర్షియల్ విమానాల రాకపోకలు లేవు గనుక హడావుడిగా ఈ విమానాశ్రయానికి చేరుకోవద్దని కాబూల్ ఎయిర్ పోర్టు అథారిటీ ప్రకటించింది.

ఇలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇండియా మధ్య తిరగవలసిన విమానాల రూట్లను కూడా తగిన విధంగా మార్చాలని యోచిస్తున్నారు. షికాగో-న్యూఢిల్లీ, శాన్ ఫ్రాన్సిస్కో =ఢిల్లీ విమానాలను గల్ఫ్ లోని ఓ దేశం వైపు మార్గం మళ్లించవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియా నుంచి అమెరికా వెళ్లే ప్లేన్లను కూడా కొత్త మార్గాల ద్వారా ఆపరేట్ చేయనున్నట్టు సమాచారం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హిందూ స్త్రీలు ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టే కుంకుమ బొట్టు ప్రాముఖ్యత ఏమిటంటే..

CM KCR Huzurabad Live: దళితుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. మరికాసేపట్లో తెలంగాణ దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం.