పశువులను దొంగతనం చేస్తున్న బంగ్లాదేశీయుల ముఠా అరెస్ట్

వెస్ట్‌ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు బీఎస్ఎఫ్ పోలీసులు. 141 బెటాలియన్‌కు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఐదుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. వీరు..

పశువులను దొంగతనం చేస్తున్న బంగ్లాదేశీయుల ముఠా అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 8:30 PM

వెస్ట్‌ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు బీఎస్ఎఫ్ పోలీసులు. 141 బెటాలియన్‌కు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఐదుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. వీరు జూలై 8,9వ తేదీల్లో అక్రమంగా పశువులను బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. వీరు ముర్షిదాబాద్‌ మీదుగా ఈ ఘటనకు పాల్పడ్డారు. వీరిని గుర్తించి అరెస్ట్ చేశామని.. వీరి వద్ద నుంచి ఐదు పశువుల్ని స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా నిత్యం బంగ్లాదేశ్‌కు భారత్‌ నుంచి పశువుల్ని తరలిస్తున్నారని.. ఈ ముఠాలపై దృష్టి పెట్టామని తెలిపారు.

Latest Articles