పాక్కు అనుకూల నినాదాలు.. చితక్కొట్టిన గ్రామస్థులు
మోర్తాడ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశమంతా కంటతడి పెట్టిస్తోంటే.. కొందరు మాత్రం తమ పైత్యాన్ని చూపించుకుంటున్నారు. పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు యువకులను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్వాసలు చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు మోర్తాడ్లోని ఓ హెయిర్కటింగ్ సెలూన్ను లీజ్కు తీసుకొని నడుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంతోషం వ్యక్తంచేస్తూ.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కలిసి పాక్కు అనుకూలంగా […]
మోర్తాడ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశమంతా కంటతడి పెట్టిస్తోంటే.. కొందరు మాత్రం తమ పైత్యాన్ని చూపించుకుంటున్నారు. పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు యువకులను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్వాసలు చితక్కొట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు మోర్తాడ్లోని ఓ హెయిర్కటింగ్ సెలూన్ను లీజ్కు తీసుకొని నడుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంతోషం వ్యక్తంచేస్తూ.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కలిసి పాక్కు అనుకూలంగా నినాదాలు చేసి వీడియోను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. దీంతో వారిలో ఇద్దరు పరారు అవ్వగా.. మరో యువకుడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు.