Afghanistan: తెరపైకి తాలిబన్ల పిచ్చి రూల్‌.. భయాందోళనలో ప్రజలు !! వీడియో

|

Nov 11, 2021 | 6:06 PM

ఆప్గనిస్తాన్‌లో తాలిబన్లు పరిపాలన ఏమోగానీ తమ నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా విదేశీ క‌రెన్సీపై తాలిబ‌న్లు నిషేధం విధించారు.

ఆప్గనిస్తాన్‌లో తాలిబన్లు పరిపాలన ఏమోగానీ తమ నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా విదేశీ క‌రెన్సీపై తాలిబ‌న్లు నిషేధం విధించారు. దీంతో ఇ‍ప్పటికే ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అంతంత మాత్రంగానే ఉండగా, ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మ‌రింత కఠినంగా త‌యారుకానుంది. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్గనిస్తాన్‌ వెళ్లినప్పటి నుంచి అంతర్జాతీయ సమాజం తాలిబాన్ల పరిపాలనను ప్రభుత్వంగా గుర్తించడానికి నిరాకరించింది. మరో వైపు ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో బ్యాంకులు నగదు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి క‌ష్టాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు పరిపాలనంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం లాంటివి గాక కేవలం తమకు తెలిసిన రాక్షస పాలన, ఏకాధిపత్య నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తూ వస్తున్నారు తాలిబన్లు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Tooth Infection: దంత శుభ్రతతో మీ గుండె పదిలం !! వీడియో

Aadhaar: ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా !! వీడియో

Viral Video: కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ !! వీడియో వైరల్

Follow us on