పైలట్లే కూల్చేశారా ?? తాజాగా దొరికిన విమాన తలుపు !!

Updated on: Dec 21, 2022 | 8:13 PM

ఎనిమిదేళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి సంబంధించి కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. పైలట్లే దాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎనిమిదేళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి సంబంధించి కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. పైలట్లే దాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంహెచ్‌370 అనే ఈ విమానం 2014 మార్చి 8న కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌కు వెళ్లే క్రమంలో అదృశ్యమైంది. విమానంలోని 239 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించినట్లుగా పరిగణించారు. బోయింగ్‌-777 తరగతికి చెందిన ఈ విమాన చక్రాల భాగానికి సంబంధించిన తలుపు.. తుపాను ధాటికి 2017లో మడగాస్కర్‌ తీరానికి కొట్టుకొచ్చింది. అదే ఏడాది టాటాలీ అనే మత్స్యకారుడికి ఇది దొరికింది. దీని ప్రాముఖ్యతను గుర్తించని అతడు.. ఐదేళ్ల పాటు ఆ శకలాన్ని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆయన భార్య దీన్ని బట్టలు ఉతకడానికి ఉపయోగించింది. 25 రోజుల కిందట అది నిపుణుల దృష్టికి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఇంజినీరు రిచర్డ్‌ గాడ్‌ఫ్రే, అమెరికాకు చెందిన విమాన శకలాల అన్వేషకుడు బ్లెయిన్‌ గిబ్సన్‌లు ఆ భాగాన్ని విశ్లేషించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మా..నువ్వు దేవతవి అంతే.. ఉద్యోగులకు రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..

ఇండియాలోనే అత్యంత కాస్ల్టీ కారు కొన్న హైదరాబాదీ !! ధర తెలిస్తే షాక్ !!

ఓర్నీ.. ఈ వయసులో మీకిదేం పిచ్చిరా సామీ !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

రైల్వే కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వెరీ ఇంట్రెస్టింగ్‌ !!

పొట్ట కూటికోసం చిన్నారుల విన్యాసాలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

 

 

Published on: Dec 21, 2022 08:13 PM
Loading...
Unable to load recommendations.
Follow Us