గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్‌ దాడుల్లో 70 మంది మృతి

|

Mar 02, 2024 | 8:33 PM

ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లాడుతోంది. తాజాగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడుల్లో ఆహార సాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 70 మంది మృతి చెందారు. 250 మందికిపైగా గాయపడ్డారని షిఫా ఆస్పత్రిలోని నర్సింగ్ విభాగం హెడ్​ తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో నేలమీద పడిఉన్న డజన్ల కొద్దీ మృతదేహాలను వైద్యులు చూశారని కమల్ అద్వాన్ ఆస్పత్రిలోని అంబులెన్స్​ సేవల హెట్​ ఫేర్స్​ అఫానా తెలిపారు.

ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లాడుతోంది. తాజాగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడుల్లో ఆహార సాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 70 మంది మృతి చెందారు. 250 మందికిపైగా గాయపడ్డారని షిఫా ఆస్పత్రిలోని నర్సింగ్ విభాగం హెడ్​ తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో నేలమీద పడిఉన్న డజన్ల కొద్దీ మృతదేహాలను వైద్యులు చూశారని కమల్ అద్వాన్ ఆస్పత్రిలోని అంబులెన్స్​ సేవల హెట్​ ఫేర్స్​ అఫానా తెలిపారు. క్షతగాత్రులు, మృతదేహాలను తీసుకెళ్లేందుకు సరిపడా అంబులెన్స్​లు లేక, కొందరిని గాడిద బళ్లపై ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు ఇంకా ఆస్పత్రికి వస్తున్నారని అల్​-అవుదా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ సల్హా తెలిపారు. రిసెప్షన్​ వద్ద, ఎమర్జెన్సీ గదుల్లో చాలా మంది ఉన్నారని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరికే అవకాశం ఉందని వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీల్‌ఛైర్‌ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

పగలు భోజనం తర్వాత నిద్ర.. అంత డేంజరా ??

‘మచు పిచ్చు’ను ముంచెత్తిన వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు

సూర్యుడిపై మచ్చ.. ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన

అంబేద్కర్ బొమ్మతో రూ.100 నోట్లు.. మేడారం జాతరలో ఫేక్ కరెన్సీ

Follow us on