బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కు ఆస్ట్రేలియా పార్లమెంట్లో షాక్ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడటం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘‘మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకొన్నవి మొత్తం వాపస్ ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు’’ అంటూ ఆమె పెద్దపెద్దగా కేకలు వేశారు.
ఆస్ట్రేలియా రాణి హోదా నుంచి క్వీన్ ఎలిజిబెత్-2ను తప్పించి.. పార్లమెంట్ సభ్యులు ఎన్నుకొన్నవారిని నియమించేలా 1999లో ఓటింగ్ జరిగింది. నాడు స్వల్ప మెజార్టీతో ఈ తీర్మానం వీగిపోయింది. మరోవైపు దేశంలో ఆదివాసీ కన్సల్టేటీవ్ అసెంబ్లీ ఏర్పాటుకు తీర్మానాన్ని కూడా 2023లో పార్లమెంట్ భారీ మెజార్టీతో తిరస్కరించింది. ఆస్ట్రేలియా దాదాపు 100 ఏళ్లకు పైగా బ్రిటన్ వలస రాజ్యంగా ఉంది. ఈ సమయంలో వేలమంది ఆదివాసీ ఆస్ట్రేలియన్లు హత్యలకు గురయ్యారు. ఆ తర్వాత 1901లో ఆ దేశం అప్రకటిత స్వాతంత్ర్యం సాధించింది. కానీ, పూర్తిస్థాయి రిపబ్లిక్గా ఏర్పడలేదు. ప్రస్తుతం దానికి కింగ్ఛార్లెస్-3 రాజుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటన మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.