China: చైనా లో పేలిన గ్యాస్ పైప్ లైన్ 12 మంది మృతి… 100 మందికి పైగా గాయాలు.. ( వీడియో )

|

Jun 14, 2021 | 8:24 AM

సెంట్రల్ చైనాలో ఆదివారం ఉదయం జరిగిన గ్యాస్ పేలుడులో 12 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు.

సెంట్రల్ చైనాలో ఆదివారం ఉదయం జరిగిన గ్యాస్ పేలుడులో 12 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. హుబె ప్రావిన్స్ లోని జాంగ్వాన్ జిల్లా షియాన్ సిటీలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జనావాసాల మధ్య పేలుడు జరగడంతో ఇంకా ఎక్కువమంది మరణించి ఉండవచ్చునని భావిస్తున్నారు., సుమారు 150 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అనేక ఇళ్ళు ఈ ఘటనలో దెబ్బ తిన్నాయి. తీవ్రంగా గాయపడిన 39 మందిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఆరెంజ్ సూట్లలో ఉన్న సహాయక బృందాలు రక్షణ చర్యల్లో నిమగ్నమైన దృశ్యాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హైదరాబాద్‌ ఖరీదైన కుక్క కిడ్నాప్‌.. ఆచూకీ అందించిన వారికి రివార్డు.. (వీడియో )

Viral Video: ఇంటి ముందు ఆపిన కారు.. ఎవరో మంత్రమేసినట్టు మాయమైంది…( వీడియో )

Follow us on