రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్‌

|

Nov 09, 2023 | 8:51 PM

చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్‌లు తమ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు, ఎక్కువ లైక్‌లు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేసి చిక్కుల్లో పడుతుంటారు. ఇదే కోవకు చెందిన ఒక యూట్యూబర్‌ ఏకంగా రైలు పట్టాల మధ్యలో పాము బిళ్లల పటాకులు కాల్చాడు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహించే ఒక వ్యక్తి ఫులేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్యలోని..

చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్‌లు తమ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు, ఎక్కువ లైక్‌లు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేసి చిక్కుల్లో పడుతుంటారు. ఇదే కోవకు చెందిన ఒక యూట్యూబర్‌ ఏకంగా రైలు పట్టాల మధ్యలో పాము బిళ్లల పటాకులు కాల్చాడు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహించే ఒక వ్యక్తి ఫులేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్యలోని సిమ్మెంట్‌ దిమ్మపై చాలా పాము బిళ్లలు ఉంచి ఒక్కసారిగా నిప్పంటించాడు. దీంతో దట్టంగా మంటలు, పొగలు వ్యాపించాయి. టపాసులతో పొల్యూషన్ ఎంత ప్రమాదమో చెబుతూ వీడియో షూట్‌ చేసాడు. ఆ సమయంలో మరో ట్రాక్‌పై పెట్రోల్‌ ట్యాంకులతో గూడ్స్ రైలు వెళ్లింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్‌’ రైళ్లు.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు​

పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !!

Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం

చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్‌ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు

 

Follow us on