AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాంగ్ స్టర్‌ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్

గ్యాంగ్ స్టర్‌ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్

Phani CH
|

Updated on: Apr 01, 2024 | 9:04 PM

Share

కరీబియన్ దేశం హైతీలో పేరుకే ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం.. దేశంలోని చాలాప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్ లు సర్వసాధారణం.. అలాంటి చోటుకు ఓ యూట్యూబర్ వెళ్లాడు. అక్కడి టూరిస్టు ప్రాంతాలను చూసి, తిరిగి వచ్చేయకుండా హైతీలోనే అత్యంత పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్ ను తన ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు గ్యాంగ్ స్టర్లు ఈ యూట్యూబర్ ను ఎత్తుకెళ్లారు.

కరీబియన్ దేశం హైతీలో పేరుకే ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం.. దేశంలోని చాలాప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్ లు సర్వసాధారణం.. అలాంటి చోటుకు ఓ యూట్యూబర్ వెళ్లాడు. అక్కడి టూరిస్టు ప్రాంతాలను చూసి, తిరిగి వచ్చేయకుండా హైతీలోనే అత్యంత పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్ ను తన ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు గ్యాంగ్ స్టర్లు ఈ యూట్యూబర్ ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఆరు లక్షల డాలర్లు ఇస్తే కానీ వదిలేది లేదంటూ ఫొటోలు, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గ్యాంగ్ స్టర్ల చెరలో ఉన్న ఆ యూట్యూబర్ పేరు పియర్ మలూఫ్.. అమెరికాకు చెందిన మలూఫ్ తన ఛానల్ పేరు ‘యువర్ ఫెల్లో అరబ్’ తోనే ఎక్కువగా పాప్యులర్ అయ్యాడు.హైతీలో అడుగుపెట్టిన 24 గంటల్లోనే మలూఫ్ ను, ఆయన హైతీ మిత్రుడిని మవోజో గ్యాంగ్ కు చెందిన 400 మంది గ్యాంగ్ స్టర్లు కిడ్నాప్ చేశారు. మార్చి 14న ఈ ఘటన జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు