నందిగామలో అరుదైన సంఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన అరుదైన సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామ పట్టణానికి చెందిన షేక్ అమీనా పురిటి నొప్పులతో బాధపడుతూ పద్మశ్రీ ప్రైవేట్ ఆస్పత్రికి రావటం జరిగింది.
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన అరుదైన సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామ పట్టణానికి చెందిన షేక్ అమీనా పురిటి నొప్పులతో బాధపడుతూ పద్మశ్రీ ప్రైవేట్ ఆస్పత్రికి రావటం జరిగింది. డాక్టర్లు పరిశీలించి ఆమెకు బ్లడ్ శాతం తక్కువగా ఉండటంతో సకాలంలో స్పందించారు. మానవతాదృక్పధంతో డబ్బులు తీసుకోకుండా, ఆమెకు సర్జరీ చేశారు. నిమిషాల వ్యవదిలోనే తొలుత ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువు జన్మించారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించటంతో ఆ కుటంబం సంతోషం వ్యక్తం చేసింది. తల్లి,ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెకు చికిత్స అందించిన వైద్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజుల తర్వాత..
నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు !! పోలీసుల విచారణలో సంచలన విషయాలు