AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ

భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ

Phani CH

|

Updated on: Apr 02, 2025 | 3:31 PM

విశాఖ పీఎం పాలెం వైయస్సార్ కాలనీలో కలకలం రేగింది. భర్తపై అలిగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. భవనం పైకెక్కి కిటికీ సన్ షేడ్ పై దిగి కూర్చుంది సూరి అనే మహిళ. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. పైకి రావాలని కోరారు.. అయినా వినకుండా.. దూకేస్తానని బెదిరిస్తూ మారాం చేసింది ఆ మహిళ.

దీంతో అతి కష్టం మీద బుజ్జగించి పైకి లాగి రక్షించ్చారు ఎస్సై భాస్కర్. కిటికీ సన్ సైడ్ పై సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తూ కూర్చున్న ఆ మహిళను రక్షించేందుకు పోలీసులకు తలప్రాణం తోక్కొచ్చింది. సదరు మహిళను చేయి పట్టుకుని పైకి లాగుదామంటే.. మహిళా కానిస్టేబుల్స్ ఆ సన్ షేడ్ వరకు వెళ్లే సాహసం చేయలేరు. దీంతో ప్రమాదం అని తెలిసిన ఎస్ఐ భాస్కర్.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఆమెను రెస్క్యూ చేసేందుకు పెద్ద సాహసమే చేశారు. తన వెనుక రెండు కాళ్లు పట్టుకోమని చెప్పి.. సిబ్బంది స్థానికుల సహకారంతో సన్ షేడ్ వరకు బయటకు వంగారు ఎస్సై. మెల్లగా సూరి ఆమె చేయిని పట్టుకున్నారు. తాను పైకి వచ్చేది లేదని చెప్పినా.. రెండు చేతులు పట్టుకొని పైకి లాగి రెస్క్యూ చేశారు ఎస్ఐ భాస్కర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ

పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు

విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. వైరల్‌ అవుతున్న ఫోటో

ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ ప్రాణం పోసిన ‘ఏఐ’