AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్‌ క్లిప్‌, పాకెట్‌ నైఫ్‌తో పురుడు పోసిన ఆర్మీ వైద్యుడు వీడియో

హెయిర్‌ క్లిప్‌, పాకెట్‌ నైఫ్‌తో పురుడు పోసిన ఆర్మీ వైద్యుడు వీడియో

Samatha J
|

Updated on: Jul 13, 2025 | 8:56 AM

Share

పురిటి నొప్పులు భరించలేక రైల్వే స్టేషన్‌ లో అల్లాడుతున్న ఓ గర్భిణికి అక్కడే ఉన్న ఓ ఆర్మీ డాక్టర్‌ డెలివరీ చేసి ప్రాణాలు నిలబెట్టాడు. ఎలాంటి పరికరాలు లేకపోయినా కేవలం హెయిర్‌ క్లిప్ , పాకెట్‌ నైఫ్‌ తో డెలివరీ చేసి తల్లీబిడ్డలను బతికించారు. దాంతో డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నార్త్‌ సెంట్రల్ రైల్వేలోని ఝాన్సీ డివిజన్‌ లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పీఆర్‌వో మనో కుమార్‌ సింగ్‌ వివరాల ప్రకారం.. ఓ గర్భిణి పన్వెల్‌-ఘోరఖ్‌పూర్‌ రైలులో ప్రయాణిస్తుండగా ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆస్పత్రికి తరలించడం కోసం ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో ఆమెను కిందకు దించారు.

రైలు దిగగానే వీల్‌చైర్‌లో లిఫ్టు దగ్గరకు తీసుకెళ్లగా నొప్పి తీవ్రమై విలవిల్లాడుతూ ఆమె కింద పడిపోయింది.అది చూసి అక్కడే హైదరాబాద్‌ వెళ్లే రైలు కోసం వేచిచూస్తున్న ఆర్మీ వైద్యుడు మేజర్‌ డాక్టర్‌ రోహిత్‌ బచ్‌వాలా స్పందించారు. రైల్వే సిబ్బంది సాయంతో ఆమెకు ప్లాట్‌ఫామ్‌పైనే అత్యవసరంగా డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వే సిబ్బంది తమ దగ్గరున్న సామాగ్రితో ఏర్పాట్ల చేయగా.. వైద్యుడు కేవలం హెయిర్‌ క్లిప్‌, పాకెట్ నైఫ్‌తో డెలివరీ చేశారు. డెలివరీ అనంతరం తల్లీబిడ్డ క్షేమం అని నిర్ధారించుకున్న తర్వాత హెయిర్‌ క్లిప్‌తో బొడ్డుతాడును లాక్‌ చేసి, పాకెట్ నైఫ్‌తో దాన్ని కత్తిరించారు. సదరు గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీబిడ్డను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తన రైలు రావడంతో ఆర్మీ వైద్యుడు హైదరాబాద్‌కు వచ్చారు. కాగా సమయానికి స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలు నిలబెట్టిన ఆర్మీ డాక్టర్‌పై రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో

అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో

రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో

ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!

Published on: Jul 13, 2025 08:50 AM