సినిమాలో లెక్కనే వివాహ విందులో మహిళ రచ్చ రంబోలా వీడియో
వేసవి అంటే వెంటనే గుర్తొచ్చేది మామిడి పండ్లు. సమ్మర్ సీజన్లో మార్కెట్లో ఎటు చూసినా రకరకాల మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడిపండును ఫలరాజ్యంగా పిలుస్తారు. ఎందుకంటే అన్ని పండ్లలోను దీని రుచి డిఫరెంట్ గా అద్భుతంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కో రకం మామిడిపండు ఒక్కో రుచితో ఆహార ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ మామిడి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మామిడిపండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో దిట్ట.
గుండెజబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో పోరాడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే మీరు మామిడి పండ్లను సరైన పద్ధతిలో తింటున్నారా? మామిడిపండ్లను ఎలా తినాలి? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. మామిడిలో విటమిన్లు, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ముక్కలు చేసుకుని మిక్సీలో పేస్ట్ లా చేసి పాలలో కలుపుకొని తింటే రెట్టింపు ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. మామిడి జ్యూస్ తాగినా కూడా ఎముకలు బలంగా తయారవుతాయి అని చెబుతున్నారు. పండిన మామిడిపండ్లను పాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి రంగు వస్తుంది. అంతేకాక ఇది శరీరానికి చల్లదనం పరుస్తుందని అలాగే అధిక పోషకాలను అందిస్తుంది. సాధారణంగా భోజనం తర్వాత లేదా భోజనంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
ఓల్డ్సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో