భార్యను కిరాతకంగా చంపి పారిపోయిన భర్త.. ఆచూకీ తెలిపిన వారికి రెండున్నర కోట్ల రివార్డు

|

Apr 15, 2024 | 6:50 PM

అమెరికాలో భార్యను అత్యంత కిరాతంగా హత్యచేసి పరారయ్యాడు ఓ వ్యక్తి. 9 ఏళ్ల క్రితం అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అగ్రరాజ్యం ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా అతడిపై భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రెండున్నర కోట్లు రివార్డు ఇస్తామని వెల్లడించింది.

అమెరికాలో భార్యను అత్యంత కిరాతంగా హత్యచేసి పరారయ్యాడు ఓ వ్యక్తి. 9 ఏళ్ల క్రితం అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అగ్రరాజ్యం ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా అతడిపై భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రెండున్నర కోట్లు రివార్డు ఇస్తామని వెల్లడించింది. 2015 ఏప్రిల్‌ 12న మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రేశ్ పటేల్‌, అతడి భార్య పాలక్‌, స్థానికంగా ఉండే ఓ డోనట్‌ దుకాణంలో పని చేసేవారు. హత్య జరిగిన రోజున వీరిద్దరూ నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణంలోని కిచెన్‌లో పనిచేస్తున్న పాలక్‌ దగ్గరకు అతడు వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన

బోర్నవిటా అస్సలు హెల్త్ డ్రింకే కాదు… స్పష్టం చేసిన కేంద్రం

Follow us on