తన టూవీలర్ను రిపేర్ చేయలేదని ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్నే తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు కాలిపోయాయి. కర్ణాటక కలబుర్గిలో ఈ ఘటన జరిగింది. మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే కొని 20 రోజులు కాకముందే అతని వాహనంలో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి ఊరికే ఆగిపోవడం జరిగింది. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా , ఓలా షోరూమ్కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదు. తన టూవీలర్ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదు. దీంతో కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆగ్రహంతో పెట్రోల్ పోసి కంపెనీ షోరూమ్కు నిప్పంటించాడు. షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు వాహనాలు, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. షాప్కు రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్ను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.