హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
కొంతకాలం క్రితం హత్యకు గురైన యువతి తాజాగా సజీవంగా కనిపించింది. అదికూడా హత్యానేరం కింద జైలుకి వెళ్లిన యువకుడి తల్లికే కనిపించింది. దాంతో విషయం పోలీసులకు చెప్పింది యువకుడి తల్లి.
కొంతకాలం క్రితం హత్యకు గురైన యువతి తాజాగా సజీవంగా కనిపించింది. అదికూడా హత్యానేరం కింద జైలుకి వెళ్లిన యువకుడి తల్లికే కనిపించింది. దాంతో విషయం పోలీసులకు చెప్పింది యువకుడి తల్లి. నిందితుడి తల్లి ఫిర్యాదుతో యుతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినిమాను తలపించే ఈ సీన్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. 2015లో ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తండ్రి 18 ఏళ్ల యువకుడు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి తన కూతురుని కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు విష్ణుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కొన్ని నెలల తర్వాత ఆగ్రాలో ఒక బాలిక మృతదేహం లభించింది. అది తన కుమార్తె మృతదేహమేనని ఆమె తండ్రి తెలిపాడు. ఈ నేపథ్యంలో విష్ణుపై హత్య కేసు కూడా నమోదు చేసిన పోలీసులు అతడ్ని జైలుకు తరలించారు. కాగా, తన కుమారుడు ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మిన విష్ణు తల్లి, కుమారుడి హత్య కేసుపై దర్యాప్తును ఆమెనే స్వయంగా చేపట్టింది. కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ కోసం చాలా మందిని ఆరా తీసింది, పలు ప్రాంతాల్లో వెతికింది. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఆమె శ్రమ ఫలించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

