AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. !! అమ్మవారి గుడిపై కలశం మాయం.. వీడియో

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. !! అమ్మవారి గుడిపై కలశం మాయం.. వీడియో

Phani CH
|

Updated on: Oct 01, 2021 | 9:49 AM

Share

చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు..ఇండ్లు, కాలనీలు, దుకాణాలు, బ్యాంకులనే కాదు..ఏకంగా గుళ్లు, గుడిగోపురాలపై ఉన్న కలశాలను సైతం కాజేస్తున్నారు..

చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు..ఇండ్లు, కాలనీలు, దుకాణాలు, బ్యాంకులనే కాదు..ఏకంగా గుళ్లు, గుడిగోపురాలపై ఉన్న కలశాలను సైతం కాజేస్తున్నారు.. తాజాగా, గంగాధర నెల్లూరు మండలం అరవచేను లో దొంగలు తెగబడ్డారు. గ్రామంలోని గ్రామత దేవత ఆలయం విమాన గోపురంపై ఉన్న కలశాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు..స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే, జిల్లాలో అమాయక ప్రజల్ని టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గత కొద్దికాలంగా పురాతన ఆలయాల్లో మాయమవుతున్న విగ్రహాలు, ఆలయ గోపురాలపై ఉన్న కలశాలు మాయంకావటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Shocking Video: వామ్మో.. చిన్నారి ఒడిలో గురకపెడుతున్న భారీ ఫైతాన్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. వైరల్

కోనసీమవాసుల్లో కొత్త గుబులు.. హెచ్చరిస్తున్న తూనీగలు.. !! వీడియో