నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాహనానికి అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న వాహనంలో నుంచి బాధితులు..

నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు

|

Updated on: Jul 16, 2022 | 9:36 AM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాహనానికి అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న వాహనంలో నుంచి బాధితులు.. రక్షించాలంటూ కేకలు వేశారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని అక్కడున్న కొందరు ఫోన్లలో చిత్రీకరించగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నాగ్‌పూర్‌లోని సావ్నర్ తహసీల్‌ కేల్వాద్‌ దగ్గర నందా నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కారు కొట్టుకుపోయిందని.. ఈ ఘటనలో మహిళతోపాటు ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పూర్‌కు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా రెయిలింగ్ లేని బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తోంది. వాహనం వెళ్తుండగా.. వరదనీరు ముంచెత్తడంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు కిలోల బంగారు నగలు ధరించి మరీ ఫలుడా అమ్ముతున్న వ్యక్తి !!

పిచ్చి పీక్స్‌ చేరడమంటే ఇదేనేమో.. చివరికి అక్కడ కూడా టాటూ వేయించుకున్న యువతి !! టాటూల కోసం 2 కోట్లు ఖర్చు !!

Follow us
Latest Articles
భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్..
భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్..
టీ20 ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ ప్లేయర్
టీ20 ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ ప్లేయర్
రోజు 10వేల అడుగులు నడవండి.. ఎన్ని మార్పులు జరుగుతాయో గమనించండి
రోజు 10వేల అడుగులు నడవండి.. ఎన్ని మార్పులు జరుగుతాయో గమనించండి
తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాతర..
తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాతర..
TSRTC రికార్డు బ్రేక్‌.. 3 రోజుల్లోనే 1.42 కోట్ల మంది సొంతూళ్లకు
TSRTC రికార్డు బ్రేక్‌.. 3 రోజుల్లోనే 1.42 కోట్ల మంది సొంతూళ్లకు
ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసేందుకు సిద్దంగా ఓటర్లు..
ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసేందుకు సిద్దంగా ఓటర్లు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయి
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయి
ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల జాతర.. ఆ ప్రాంతాల్లో హై అలర్ట్..
ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల జాతర.. ఆ ప్రాంతాల్లో హై అలర్ట్..
తెలంగాణలో పోలింగ్ షురూ.. ఈ ప్రాంతంలో సాయంత్రం 4 వరకే పోలింగ్..
తెలంగాణలో పోలింగ్ షురూ.. ఈ ప్రాంతంలో సాయంత్రం 4 వరకే పోలింగ్..
మరికాసేపట్లో 4వ దశ: 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
మరికాసేపట్లో 4వ దశ: 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్