రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్‌ ప్రసారం !! ఒక్కసారిగా జనాలు ఏం చేశారంటే ??

|

Mar 28, 2023 | 8:32 PM

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రయాణీకుల సౌకర్యార్థం లేదా ప్రకటన కోసం రైల్వే జంక్షన్ ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టీవీ సెట్‌లో అకస్మాత్తుగా బ్లూ ఫిల్మ్ ప్లే అయింది.

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రయాణీకుల సౌకర్యార్థం లేదా ప్రకటన కోసం రైల్వే జంక్షన్ ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టీవీ సెట్‌లో అకస్మాత్తుగా బ్లూ ఫిల్మ్ ప్లే అయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బ్లూ ఫిల్మ్ ప్లే కావడంతో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు సిగ్గుతో తలలు దించుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ సంఘటన ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 పై జరిగింది. ప్లాట్‌ఫారమ్‌లోని టీవీ సెట్‌లో ఈ చిత్రం ప్రసారం అయిన వెంటనే.. అక్కడున్న పలువురు ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. దాదాపు మూడు నిమిషాలకు పైగా బ్లూ ఫిల్మ్ ప్లే అవుతూనే ఉందని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్ !! పాపం చివరికి ఏమైందంటే ??

అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై నిల్చున్న ఫ్యామిలీ !! ఆ భారత ఆర్మీ జవాన్లు ఏం చేశారంటే ??

పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వధువు నవ్వడంచూసి వరుడు ఏంచేశాడో తెలుసా ??

Follow us on