Pregnant Teacher: ఇదేం పోయేకాలం రా మీకు..! గర్భిణీ అని చూడకుండా.. టీచర్పై స్టూడెంట్స్ గ్యాంగ్ దాష్టీకం..!
మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని నేర్చుంటాం. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ప్రతి ఒక్కరూ గౌరవించే స్థానం గురువులది. వారు అందించిన విద్య, విజ్ఞానమే భావితరాలకు బంగారు బాట. కానీ,
మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని నేర్చుంటాం. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ప్రతి ఒక్కరూ గౌరవించే స్థానం గురువులది. వారు అందించిన విద్య, విజ్ఞానమే భావితరాలకు బంగారు బాట. కానీ, ఇక్కడ మాత్రం దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఒకటి అస్సాంలో వెలుగుచూసింది. ఓ ఉపాధ్యాయురాలిని అవమానించి, దాడి చేశారు విద్యార్థులు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై దాడికి దిగారు కొందరు విద్యార్థులు. బాధిత మహిళా టీచర్ 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా దాష్టీకానికి పాల్పడ్డారు. దిబ్రూఘర్లోని మోరన్ సబ్ డివిజన్లోని దోమర్దలాంగ్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు విద్యార్థులపై ఉపాధ్యాయురాలు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఆమెను రీప్లేస్ చేయడానికి 22 మంది విద్యార్థులు మహిళా ఉపాధ్యాయురాలిపై గ్యాంగ్ కట్టారు. ఈ క్రమంలోనే నవంబర్ 27న తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులు గర్భిణీ టీచర్ను విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధ్యులైన విద్యార్థులను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

