నీ ధైర్యానికో దండంరా సామీ.. దాన్ని పట్టుకుని ఆలా ఎలా వెళ్ళావు రా..
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. పాము కాటుకు గురైన గౌరవ్ కుమార్ అనే వ్యక్తి, కరిచిన పామును పట్టుకుని కిలోమీటర్ నడిచి ఆసుపత్రికి వెళ్ళాడు. ఇది చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యువకుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. పామును చేతుల్లో పట్టుకుని ఆసుపత్రికి రావడం అందరినీ షాక్కి గురిచేసింది.
ఎవరినైనా పాము కరిస్తే ఏం చేస్తారు.. లబో దిబోమంటూ డాక్టర్ దగ్గరకి పరుగెత్తుతారు. కానీ ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తి చేసిన పనికి డాక్టర్లే షాక్ అయ్యారు. తనను కరిచిన పామును పట్టుకొని ఏకంగా డాక్టర్ల వద్దకు తీసుకెళ్లాడు. పాము కరిచిందని కంగారు పడకుండా ఆ పామును పట్టుకొని మరీ ఆసుపత్రికి పరిగెత్తాడు. అతను ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వెళ్లి పామును చూపించి వైద్య సహాయం కోరాడు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పాము కాటుకు గురైన యువకుడి పేరు గౌరవ్ కుమార్గా తెలుస్తోంది. బిజ్నోర్ నివాసి అయిన 30 ఏళ్ల గౌరవ్ ఇంటి దగ్గర పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సమీపంలోని పొద నుండి ఒక పాము బయటకు వచ్చి అతని చేతిని కరిచింది. అతను భయపడకుండా వెంటనే పామును చేతిలో గట్టిగా పట్టుకుని, దాదాపు కిలోమీటరు నడిచి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత, అక్కడి సిబ్బంది పామును సురక్షితంగా ఒక బాక్స్లో బంధించారు. యువకుడికి అవసరమైన ట్రీట్మెంట్ అందించారు. గౌరవ్ చేసిన పనికి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోను ఓయూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. చాలా మంది ఇప్పటికే ఆ వీడియోను చూశారు. వీడియోకు లైక్లు, కామెంట్స్ వెల్లువెత్తాయి. చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఆ యువకుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు
ఇంటింటికి బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఎవరు అర్హులంటే
ములుగు జిల్లాలో గుప్తనిధులు.. ఒక్కో నాణెం 23 తులాలు ??
తోటలో పనిచేసుకుంటున్న రైతు.. పొదల మధ్య సీన్ చూసి షాక్
iBomma: ఐ బొమ్మ రవికి ఎలాంటి దారుణ శిక్ష పడబోతుందో తెలుసా ??
