కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్
ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేశాడు.
ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేశాడు. ఇందులో కప్ టీ ధర 20 మాత్రమే. దీనికి సర్వీస్ ఛార్జీ 50 చెల్లించాల్సి వచ్చింది. దీంతో తీరా టీ తీసుకుని బిల్లు అందుకున్న ప్రయాణికుడు కంగుతిన్నాడు. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు దిల్లీ- బోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైల్లో జూన్ 28న ప్రయాణించాడు. కప్ టీ కొన్నందుకు గానూ అతడు 70 రూపాయలు చెల్లించాడు. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ ఇచ్చిన ఇన్వాయిస్ను ట్విటర్లో పెడుతూ ‘ 20 రూపాయల టీకి 50 రూపాయల సర్వీస్ ఛార్జ్.. మరీ ఇంత దోపిడీయా?’ అంటూ ట్వీటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..
షాపుముందు పార్క్ చేసిన బైక్.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్ రోడ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

