కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్
ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేశాడు.
ఓ కప్పు టీ ఎంతుంటుంది? మహా అయితే ఓ పదీ పదిహేను రూపాయలు. రైళ్లలో కూడా దాదాపు అంతే. కానీ ఓ రైలు ప్రయాణికుడు మాత్రం కప్పు టీ కోసం ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేశాడు. ఇందులో కప్ టీ ధర 20 మాత్రమే. దీనికి సర్వీస్ ఛార్జీ 50 చెల్లించాల్సి వచ్చింది. దీంతో తీరా టీ తీసుకుని బిల్లు అందుకున్న ప్రయాణికుడు కంగుతిన్నాడు. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు దిల్లీ- బోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైల్లో జూన్ 28న ప్రయాణించాడు. కప్ టీ కొన్నందుకు గానూ అతడు 70 రూపాయలు చెల్లించాడు. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ ఇచ్చిన ఇన్వాయిస్ను ట్విటర్లో పెడుతూ ‘ 20 రూపాయల టీకి 50 రూపాయల సర్వీస్ ఛార్జ్.. మరీ ఇంత దోపిడీయా?’ అంటూ ట్వీటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..
షాపుముందు పార్క్ చేసిన బైక్.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్ రోడ్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

