బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అనేక జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీలకు పడిపోయి పదేళ్ల రికార్డు బద్దలైంది. పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతుండగా, రాబోయే మూడు రోజులు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత పదేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. డిసెంబర్ రెండో వారంలో ఇంత పెద్ద సంఖ్యలో జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
