కంటైనర్లు తీస్తుండగా ఊహించని సంఘటన.. అందరూ చూస్తుండగానే..

|

Sep 28, 2022 | 9:51 AM

ఓ భారీ ఓడ డాక్‌యార్డ్‌కు చేరుకుంది. అందులో ఉన్న సరుకును అక్కడున్న సిబ్బంది అన్‌లోడ్ చేస్తున్నారు. ఇంతలో అనూహ్య సంఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే దెబ్బకు ఓడ క్షణాల్లో మునిగిపోయింది.

ఓ భారీ ఓడ డాక్‌యార్డ్‌కు చేరుకుంది. అందులో ఉన్న సరుకును అక్కడున్న సిబ్బంది అన్‌లోడ్ చేస్తున్నారు. ఇంతలో అనూహ్య సంఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే దెబ్బకు ఓడ క్షణాల్లో మునిగిపోయింది. టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో ఈజిప్ట్‌కు చెందిన సీ-ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. అందులో ఉన్న కంటైనర్లను అన్‌లోడింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. లోడ్‌ను దింపుతుండగా.. పడవ దానంతట అదే ముందుకు కదిలి.. ఆ వెంటనే నీట మునిగిపోవడం సిబ్బందిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ ఘటనపై టర్కీ రవాణా శాఖ ట్విట్టర్‌లో స్పందించింది. అదృష్టవశాత్తు అక్కడున్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. 24 కంటైనర్లు నీట మునిగిపోయాయని.. కొద్దిపాటి చమురు కూడా లీక్ అయిందని తెలిపింది. ఓడ మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. అయితే ఓడ మాత్రం గత కొంతకాలంగా బ్యాలెన్సింగ్ విషయంలో సమస్యలు ఎడుర్కుంటుదని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ ఓడ సెప్టెంబర్ 17న ఇస్కెండరమ్ పోర్ట్‌కు చేరుకుందని.. అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు.. కళ్ల ముందే కుమారుడు మృత్యువాత

నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!

ఉపాధికోసం ట్రాక్టర్‏లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా

కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..

రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!

Follow us on