Death-Pool: స‌ముద్రం దిగువ‌న మృత‌కొల‌ను !! ఇందులోకి పోయిన జీవి తిరిగిరాదు

|

Jul 25, 2022 | 9:09 AM

ఈ ప్రపంచమే ఓ వింత అనుకుంటే.. అందులో మరిన్ని వింతలు.. విశేషాలు.. ప్రతిరోజూ ఏదో విశేషం బయటపడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని వింతలు, విశేషాలపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు.

ఈ ప్రపంచమే ఓ వింత అనుకుంటే.. అందులో మరిన్ని వింతలు.. విశేషాలు.. ప్రతిరోజూ ఏదో విశేషం బయటపడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని వింతలు, విశేషాలపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ సముద్రం అడుగున ఉన్న ఒక ప్రాణాంతక కొలనును గుర్తించారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకి వెళ్తే… యూనివర్శిటీ ఆఫ్‌ మియామీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ డేంజరస్‌ కొలనును ఎర్రసముద్రం దిగువన గుర్తించారు. ఇది పూర్తిగా ఉప్పునీటితో 10 అడుగుల పొడవుతో ఉందని తెలిపారు. అయితే ఈ కొలను సముద్రజీవులకూ, మానవులకూ కూడా ప్రాణాంతకమైనదిగా గుర్తించారు. ఈ ఉప్పునీటి కొలనులో ఆక్సిజన్‌ లేదని, ఇందులోకి ఏ జీవి ప్రవేశించినా వెంటనే చనిపోతుందని శాస్త్రవేత్తల బృందంలో సభ్యులైన ప్రొఫెసర్ సామ్ పుర్కిస్ వివరించారు. అయితే రిమోట్‌తో ఆపరేట్‌ చేసే అండర్‌ వాటర్‌ వెహికల్‌ను ఉపయోగించి 1,770 మీటర్ల లోతులో ఉన్న ఈ ప్రమాదకర కొలనును కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా మిలియన్‌ సంవత్సరాల క్రితం భూమిపైన మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఏంటి బాస్ ఇతని టాలెంట్.. డాన్స్‌ చూస్తే.. వారెవ్వా.. ప్రభుదేవా అంటారు

మహిళకు I Like U మెసేజ్‌.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్‌ అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం

ఎట్టకేలకు వీడియోను డిలీట్ చేసిన సింగర్ కాని ఆ ఒక్క కండీషన్‌లో తగ్గట్లే !!

TOP 9 ET News: వైరల్‌ గా బన్నీ పుష్ప 2 లుక్‌.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్‌

Follow us on