ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో దాదాపు 200 మృతదేహాలు !!
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతగా మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన మంగళవారం ఉక్రెయిన్లో వెలుగుచూసింది. పూర్తిగా ధ్వంసమైపోయిన మేరియుపొల్ నగరంలో శిథిలాలను తొలగించేందుకు..
రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతగా మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన మంగళవారం ఉక్రెయిన్లో వెలుగుచూసింది. పూర్తిగా ధ్వంసమైపోయిన మేరియుపొల్ నగరంలో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులకు ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో దాదాపు 200 మృతదేహాలు కనిపించాయి. వాటిలో చాలావరకు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని, తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. మేరియుపొల్ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా చూడడానికి సంచార దహనవాటికలను తీసుకురావడంతో పాటు సామూహిక పూడ్చివేతలను రష్యా చేపడుతోందని ఆరోపించాయి. రష్యా సైనికులు డాన్బాస్ ప్రాంతంలో ముమ్మర దాడులు కొనసాగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెడిసికొట్టిన యువకుడి ప్లాన్.. ఏం జరిగిందంటే ??
Sugar mountains: సముద్ర గర్భంలో పంచదార కొండలు..
Viral Video: మెట్రోలో చిన్నారి చేసిన పనికి ప్రయాణికులంతా ఫిదా..
