ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో దాదాపు 200 మృతదేహాలు !!

Updated on: May 31, 2022 | 8:17 PM

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతగా మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన మంగళవారం ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. పూర్తిగా ధ్వంసమైపోయిన మేరియుపొల్‌ నగరంలో శిథిలాలను తొలగించేందుకు..

రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతగా మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన మంగళవారం ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. పూర్తిగా ధ్వంసమైపోయిన మేరియుపొల్‌ నగరంలో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులకు ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో దాదాపు 200 మృతదేహాలు కనిపించాయి. వాటిలో చాలావరకు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని, తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. మేరియుపొల్‌ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా చూడడానికి సంచార దహనవాటికలను తీసుకురావడంతో పాటు సామూహిక పూడ్చివేతలను రష్యా చేపడుతోందని ఆరోపించాయి. రష్యా సైనికులు డాన్‌బాస్‌ ప్రాంతంలో ముమ్మర దాడులు కొనసాగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెడిసికొట్టిన యువకుడి ప్లాన్‌.. ఏం జరిగిందంటే ??

Sugar mountains: సముద్ర గర్భంలో పంచదార కొండలు..

Viral Video: మెట్రోలో చిన్నారి చేసిన పనికి ప్రయాణికులంతా ఫిదా..

 

 

Published on: May 31, 2022 08:17 PM