పేదల పిల్లలే వాళ్ళ టార్గెట్.. అపహరించటం.. విక్రయిచటం..
హైదరాబాద్ మేడిపల్లిలో పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు చేశారు. పేద పిల్లలను అపహరించి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ఎంపీ శోభారాణి సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా ఈ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పేద కుటుంబంలోని పిల్లలే టార్గెట్గా ఈ ముఠా దందాకు తెరలేపింది.
హైదరాబాద్ మేడిపల్లిలో పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు చేశారు. పేద పిల్లలను అపహరించి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ఎంపీ శోభారాణి సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా ఈ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పేద కుటుంబంలోని పిల్లలే టార్గెట్గా ఈ ముఠా దందాకు తెరలేపింది. అయితే.. 16 మంది చిన్నారుల ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు. కాగా.. మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్లో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. పోషించడం భారమంటూ తల్లులకు చెప్పడమేకాకుడా.. మానవత్వంతో పిల్లలు లేనివారికి ఇస్తామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. సరోగమి, ఐ వి ఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబి ఎలాంటి బేబీ అయినా ఈ ముఠా విక్రయాలకు పాల్పడుతున్నారు. అయితే పిల్లల విక్రయాలు 50 మందితో జరిపారా లేక ఇంకా ఏమైనా గుట్టు దాచారా అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జధిగూడలో చిన్నారిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

