AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

Phani CH

|

Updated on: Apr 25, 2025 | 8:06 PM

చిలక జ్యోతిష్యం చెబుతుండగా…పక్కనే బైక్‌ టైరు పేలి చిలక తుర్రుమన్న ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. చిలక ఎగిరి పోవడంతో చిలుక జోతిష్యం చెప్పే వ్యక్తికి సైకిల్ టైర్ పంచర్ షాప్ యజమానికి మధ్య పంచాయతీ చినికి చినికి గాలివానగా మారింది.. చిలక తెచ్చిన చిక్కు చివరకు తన్నుకునేదాకా వచ్చింది. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్‌ క్రాస్‌ వద్ద ఈ సంఘటన జరిగింది.

దాస్‌ అనే ఓ బైక్‌ మెకానిక్‌ దుకాణం వద్దకు రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలుక జోస్యం చెబుతానని వచ్చాడు. దాస్‌ అతడిని జోస్యం చెప్పమన్నాడు. ఈ క్రమంలో రామస్వామి తన చిలుకను పంజరంలోంచి పిలిచి అతని భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమన్నాడు. పంజరంలోంచి బయటకు వచ్చిన చిలుక ఓ బొమ్మను తీసి అక్కడ పెట్టేసి మళ్లీ పంజరంలోకి వెళ్లిపోయింది. ఆ బొమ్మను చూసి జ్యోతిష్యుడు రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని చెప్పాడు. అందుకు దాస్‌.. తనకు గిరాకీ కాలేదని, మళ్లీ రమ్మని జ్యోతిష్యుడికి చెప్పాడు. అతడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ దాస్ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్‌ చెప్పాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలిచాడు. చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్‌ టైరు పేలటంతో, ఆ శబ్ధానికి భయపడి చిలుక తుర్రుమని ఎగిరిపోయి పక్కనే ఉన్న సెల్‌ టవర్‌పైకి వెళ్లి వాలింది. తన చిలుక ఎగిరిపోవడంతో జ్యోతిష్యుడు ఆ సెల్‌ టవర్‌ వద్దకు పరుగెత్తాడు. మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

మరో గ్రహంపై జీవం ?? ఇవిగో ఆధారాలు

ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగుతున్నారా ??

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??