మరీ ఇంత దారుణమా.. చిన్న పిల్లాడిని చేసి వాళ్లు చేసిన పనికి..

|

May 15, 2023 | 8:25 PM

గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌లో ఎంతటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయో వింటున్నాం.. సోషల్‌మీడియాలో చూస్తున్నాం. అక్కడ ఆహారపదార్థాల దగ్గర నుండి పెట్రోలు వరకు ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సగటు పౌరుడు బ్రతకడం కష్టంగా మారింది.

గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌లో ఎంతటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయో వింటున్నాం.. సోషల్‌మీడియాలో చూస్తున్నాం. అక్కడ ఆహారపదార్థాల దగ్గర నుండి పెట్రోలు వరకు ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సగటు పౌరుడు బ్రతకడం కష్టంగా మారింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఎన్నో వీడియోలు బయటకొస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అరటిపళ్లు అమ్ముకోవడానికి ఓ పిల్లాడు రహదారిమీదకు రాగానే అక్కడి ప్రజలంతా చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. ఓ పిల్లాడు గాడిద బండిమీద కొన్ని అరటిపండ్లు వేసుకొనిమార్కెట్ లో అమ్ముకోడానికి వచ్చాడు . బండి మార్కెట్‌లోకి రాగానే అక్కడున్న జనం ఆ బండి చుట్టూ చేరారు. వాళ్లలో ఒకరిద్దరు వ్యక్తులు బండిని ఆపారు. ఇంతలోనే అక్కడున్న వాళ్లలో కొందరు బండిలో ఉన్న అరటిపళ్లు తీసుకుని పారిపోయారు. వారిని చూసి అక్కడున్న మిగిలినవారంతా బండిలో అరటిపళ్ళు తీసుకుని పారిపోవడం మొదలుపెట్టారు. పాపం ఆ పిల్లాడు తన పళ్లను తీసుకెళ్లొద్దని ఏడ్చినా వాళ్లు లెక్కచేయలేదు. దీంతో ఆ పిల్లాడు తన బండిని ముందుకు పోనిచ్చేందుకు ప్రయత్నించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో వీడు మామూలోడు కాదు.. ఏకంగా బీర్ తో నడిచే బండినే కనిపెట్టేసాడుగా..

Weather Alert: వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

వామ్మో మాడు పగిలే ఎండలు.. బయటకు వచ్చేముందు ఒక సారి ఆలోచించండి

Prabhas: ఒక్క ప్రభాస్‌ చేతిలోనే 4000 కోట్లు

Mahesh Babu: ఈ సారి మాములుగా ఉండదు.. విలనూ అతడే.. హీరో అతడే..

Follow us on