ఆ నర్స్‌ వెనుక మరో రూపం.. అతి భయంకరంగా..

|

Aug 21, 2023 | 10:02 PM

ఆస్పత్రిలో నర్స్‌ అంటే డాక్టర్‌ తర్వాత అంతటి పాత్రను పోషిస్తుంది. డాక్టర్‌ వైద్యం చేసిన అనంతరం రోగులను తరచూ వారి ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వైద్యులకు తెలియచేస్తూ ఉంటుంది. ఇక పసి పిల్లల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాంటిది ఓ నర్స్‌ మానవత్వం మరిచిపోయి ఏకంగా ఏడుగురు నవజాత శిశువులను మట్టుబెట్టింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది.

ఆస్పత్రిలో నర్స్‌ అంటే డాక్టర్‌ తర్వాత అంతటి పాత్రను పోషిస్తుంది. డాక్టర్‌ వైద్యం చేసిన అనంతరం రోగులను తరచూ వారి ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వైద్యులకు తెలియచేస్తూ ఉంటుంది. ఇక పసి పిల్లల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాంటిది ఓ నర్స్‌ మానవత్వం మరిచిపోయి ఏకంగా ఏడుగురు నవజాత శిశువులను మట్టుబెట్టింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న లూసీ లెబ్టీ అనే మహిళ ఈ దారుణాలకు ఒడిగట్టింది. నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ నర్సు ఉన్మాదిగా మారింది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందడంతో అక్కడి వైద్యులకు అనుమానం వచ్చింది. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్కెట్‌లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే

కాలీఫ్లరవ్‌ కట్‌ చేస్తున్న మహిళకు ఊహించని షాక్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆత్మహత్యలను నివారిస్తాయా ?? కోటాలో కొత్త రకం ఫ్యాన్లు

థార్‌ ఎడారిలో పచ్చని చెట్లు .. పూల పరిమళాలు.. ఎప్పుడంటే ??

ఒక్క రోజు వధువుకి భారీ డిమాండ్‌ !! అక్కడ పురుషులు బ్రహ్మచారులుగా మరణించడం అశుభం

 

Follow us on