వామ్మో ..! నీళ్ల బాటిల్‌ ధర రూ. 50 లక్షలా?

Updated on: Apr 19, 2025 | 6:46 PM

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఐపీఎల్‌ వెంచర్‌తో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆమె విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన దుస్తులు, క్వీన్ సైజ్ లైఫ్‌స్టయిల్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె వాడే సాదాసీదా వస్తువులు కూడా లక్షలు, కోట్ల విలువైనవి ఉంటాయనీ అనుకుంటాం.

ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ ఖరీదు 49 లక్షల రూపాయలా? సాధారణ నీరు తాగడం కంటే ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా సేకరించిన నీటిని తెప్పించుకోవడానికి ధనవంతులు ఇంట్రెస్ట్‌ చూపిస్తారా? ఆ నీటిలో అంత స్పెషల్‌ ఏంటి? ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్స్ విశేషాలేంటి? తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఆరోగ్యంగా ఉండటం కోసం నీతా అంబానీ ఖరీదైనా వాటర్‌ తాగుతారా? ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 49 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ప్రచారంలో ఉంది. ఈ వాటర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మం ఎప్పుడూ మెరిసేలా చేస్తుందని, ఒత్తిడిని దూరం చేస్తుందని అనేక వార్తలు వచ్చాయి. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలలోని సరస్సుల నుంచి, ఐస్‌లాండ్‌లోని గ్లేసియర్‌ నుంచి సేకరిస్తారని, ఈ నీటిలో బంగారు ఖనిజం ఎక్కువ మోతాదులో ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: రెండో పెళ్లికి సమంత రెడీ.. మేలో ముహూర్తం?

QR కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా ?? మీ బ్యాంక్‌ ఖాతా జాగ్రత్త!

తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??

మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు.. గుర్తించడం ఎలా?