రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..

Updated on: Jun 08, 2023 | 9:47 AM

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవలేదు. ఆ ఘటనను చూసైనా అప్రమత్తంగా ఉండాల్సిన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కదిరిలో రైల్వే గేటును వేయడం మరిచిపోయారు. కనీసం అక్కడ రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవలేదు. ఆ ఘటనను చూసైనా అప్రమత్తంగా ఉండాల్సిన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కదిరిలో రైల్వే గేటును వేయడం మరిచిపోయారు. కనీసం అక్కడ రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. స్థానికులు, రైలు లోకో పైలట్ అప్రమత్తం కావడంతో మరో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యసాయి జిల్లా కదిరిలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యథేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈ లోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు ట్రాక్ దాటుతుండటం, గేటు వేయకపోవడం గమనించి లోకో పైలట్‌ రైలును ఆపేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘టైటానిక్’ హీరోతో భారత మోడల్ డేటింగ్

ఎగరడమే కాదు.. నాకు ఈత కూడా వచ్చంటున్న గుడ్లగూబ

హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??

నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..

Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us