కోతికి దశదిన కర్మ.. 4 వేల మందికి భోజనాలు !

Updated on: Nov 22, 2025 | 1:18 PM

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో హైటెన్షన్ తీగలు తగిలి ఓ కోతి మరణించగా, గ్రామస్తులు దానిని హనుమంతుని అవతారంగా భావించి మానవ సంస్కారాలు నిర్వహించారు. డీజేతో అంతిమయాత్ర, అస్థికల నిమజ్జనం చేశారు. అనంతరం 4,000 మందికి భారీ విందు ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ విందుకు లక్ష రూపాయల విరాళాలు సేకరించారు. ఇది వారి సంస్కృతిని, జంతువుల పట్ల వారి గౌరవాన్ని తెలియజేస్తుంది.

ఓ కోతి మరణించడంతో మధ్యప్రదేశ్‌లోని గ్రామస్థులంతా కలిసి మనిషికి చేసినట్టే అన్ని కర్మకాండలు నిర్వహించారు. 4 వేల మందికి భోజనం ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకున్నారు. రాజ్‌గఢ్ జిల్లా దారావరీ గ్రామంలో 12 రోజుల క్రితం హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఓ కోతి మరణించింది. ఆ కోతిని హనుమంతుడి అవతారంగా భావించిన గ్రామస్థులు, నవంబర్ 8న డీజే సౌండ్స్ మధ్య ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం శాంతి ధామ్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. 11వ రోజున గ్రామ సర్పంచ్‌ ఇంకొందరు గ్రామస్థులు ఉజ్జయిని వెళ్లి, షిప్రా నదిలో కోతి అస్థికలను నిమజ్జనం చేశారు. కుటుంబ సభ్యుడికి చేసినట్లే పురోహితులతో అన్ని కార్యక్రమాలు చేయించారు. సాంప్రదాయబద్ధంగా గడ్డం గీయించుకోవడం కూడా చేశారు. తిరిగి గ్రామానికి వచ్చాక, 12వ రోజున భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామస్థులు లక్ష రూపాయల విరాళాలు సేకరించారు. 5 క్వింటాళ్ల పిండితో పూరీలు, 40 కిలోల సేవ్, 100 లీటర్ల మజ్జిగ పులుసు, స్వీట్లు సిద్ధం చేశారు. చుట్టుపక్కల 35 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు కూడా ఆహ్వానాలు పంపడంతో 4 వేల మందికి పైగా ఈ విందుకు హాజరయ్యారు. ఇదే రాజ్‌గఢ్ జిల్లాలోని దాలుపురా గ్రామంలో 2022లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా ఓ కోతి చనిపోతే, 1,500 మంది గ్రామస్థులు కలిసి అంత్యక్రియలు నిర్వహించి, విందు ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎరక్కపోయి వెళ్లి.. ఇరుక్కుపోవడమంటే ఇదే

Top 9 ET: విజిల్ కొట్టేందుకు రెడీయా.. | బంగారు బిడ్డకు.. నాన్న నుంచి క్యూట్ విషెస్‌

అది నాలుకా తాటిమట్టా.. తనూజపై దారుణ ట్రోల్స్

బ్యాంకు కస్టమర్స్‌కు అలర్ట్.. ఆ నెంబర్ సిరీస్ నుంచి కాల్ వస్తేనే సేఫ్

టక్కులు, టైలతో వచ్చి.. ఆర్‌బీఐ అంటూ బిల్డప్ ఇచ్చి .. రూ.7.11 కోట్లు దోచేసిన గ్యాంగ్