తనను ఆదరించిన వ్యక్తి చనిపోవడంతో ఆ కోతి ఏం చేసిందో చూడండి

Updated on: Oct 16, 2023 | 6:59 PM

తమను ఆదరించే మనుషుల పట్ల జంతువులు విశ్వాసంగా ఉంటాయి. వారికోసం తపిస్తాయి. వారిని వెన్నంటే ఉంటాయి. ఆవ్యక్తులు కనిపించకపోతే అల్లాడిపోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కోతి తనకు రోజూ ఆహారం పెట్టి ఆదరించే వ్యక్తి మరణించడంతో తీవ్ర ఆవేదన చెందింది. మూగగా రోదించింది. ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి అతని అంత్య్రకియల్లో సైతం పాల్గొని తుది వీడ్కోలు పలికింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లను కదిలిస్తోంది.

తమను ఆదరించే మనుషుల పట్ల జంతువులు విశ్వాసంగా ఉంటాయి. వారికోసం తపిస్తాయి. వారిని వెన్నంటే ఉంటాయి. ఆవ్యక్తులు కనిపించకపోతే అల్లాడిపోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కోతి తనకు రోజూ ఆహారం పెట్టి ఆదరించే వ్యక్తి మరణించడంతో తీవ్ర ఆవేదన చెందింది. మూగగా రోదించింది. ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి అతని అంత్య్రకియల్లో సైతం పాల్గొని తుది వీడ్కోలు పలికింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లను కదిలిస్తోంది. అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ ఒక కోతికి ఆహారం పెట్టేవాడు. రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. రోజులో కొంత సమయం ఆ కోతి అతడితో ఆడేది. కాగా, అక్టోబరు 10న రామ్‌కున్వర్‌ సింగ్‌ మరణించాడు. రోజూలాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి విగతజీవిగా ఉన్న అతడ్ని చూసి తట్టుకోలేకపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవదుర్గా ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం

వేపచెట్టునుంచి ధారలా వస్తున్న పాలు !! దైవ ఘటనే అంటూ పూజలు

రూ. 3 కోట్ల జాబ్ ను వ‌దులుకున్న టెకీ !! కార‌ణం ఏంటంటే ??

నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు

నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us